
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'హిరణ్యకశ్యప' ప్రాజెక్ట్పై దర్శకుడు గుణశేఖర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుండగా, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై తాను స్వయంగా త్రివిక్రమ్ను సంప్రదించగా, రచన పరంగా మాత్రమే తన భాగస్వామ్యం ఉందని, దర్శకత్వ బాధ్యతలతో ఎలాంటి సంబంధం లేదని త్రివిక్రమ్ చెప్పినట్లు గుణశేఖర్ వెల్లడించారు.
అలాగే ఈ భారీ ప్రాజెక్ట్కు సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని తెలిపారు. మొదట ఫాక్స్ స్టూడియోస్, డిస్నీ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపినప్పటికీ, భారీ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నారు. గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!