

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత వర్ష: సాగ ఆఫ్ శూల’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొనసాగుతుండగానే, తన 34వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే నెల ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుని ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గోపీచంద్ సరసన అనార్కలి నాజర్ కథానాయికగా నటిస్తోంది. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. సంగీతాన్ని సామ్ సీఎస్ అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్దత్ అందిస్తున్నారు. బలమైన సాంకేతిక బృందంతో ఈ చిత్రం యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉండనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!