

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్లో దాదాపు 2 వారాల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఎన్టీఆర్పై ఈ యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కించనున్నట్టు సమాచారం. వచ్చే నెల చివరి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గాయపడిన ఎన్టీఆర్కు విజయవంతంగా సర్జరీ పూర్తవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కనిపించే డార్క్ టోన్కు భిన్నంగా ఈ సినిమా ఫ్లాష్బ్యాక్ ఫుల్ కలర్ఫుల్గా ఉండనుందట.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!