
న్యూస్

తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన ఆన్లైన్ రేటింగ్స్, రివ్యూలపై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించారు. టికెటింగ్ ప్లాట్ఫామ్లపై జరుగుతున్న సంఘటిత నెగెటివ్ ప్రచారాలు, దురుద్దేశపూరిత రేటింగ్స్ను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రముఖ ప్లాట్ఫామ్లు రేటింగ్స్, రివ్యూలను నిలిపివేశాయి.
షైన్ స్క్రీన్స్ సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12, 2026న విడుదల కానుంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాపై ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమాలపై న్యాయమైన అభిప్రాయాలు ఏర్పడేలా చేయడంలో ఇది కీలక ముందడుగుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!