
జనరల్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో తన స్థానం బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’కి సంబంధించిన కొత్త ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా ప్రమోషన్లకు జాన్వీ దూరంగా ఉండబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు సందేహాలను కూడా పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లలో గ్రామీణ యువతిగా కనిపించిన జాన్వీకి మంచి స్పందన లభించింది. అయితే ప్రమోషన్లలో పాల్గొనకపోతే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!