
జనరల్

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానం అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించగా, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ కోరింది.
అయితే ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని గుర్తించిన సుప్రీంకోర్టు, వెంటనే విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషన్ సరిచేసిన తరువాత మాత్రమే తదుపరి విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!