
జనరల్

ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ రాజకీయ థ్రిల్లర్ చిత్రం ‘అనంతన్ కాడు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా కథానాయికగా నటించగా, అచ్చుత్ కుమార్, నిఖిలా విమల్, ఇంద్రన్స్, మురళి గోపి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, ఘాటైన సంభాషణలు, ప్రేమ సన్నివేశాలు, రాజకీయ నేపథ్యం కారణంగా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. కేరళ–తమిళనాడు సరిహద్దులోని అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతి సంపదను కాపాడే వ్యక్తిగా ఆర్య కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకులు, భూకబ్జా ముఠాలకు ఎదురు నిలిచే పాత్రలో ఆయన నటిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!