

‘గట్టా కుస్తీ 2’ విజయంతో కెరీర్లో మంచి జోష్లో ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. కామెడీ సినిమాలు తనకు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రల్లో నటించడం ఆనందాన్ని ఇస్తుందని చెప్పింది. ప్రేక్షకులను నవ్వించడం అంత సులభం కాదని, ఆ విషయంలో ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలతో పాటు బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఐశ్వర్య లక్ష్మి భావోద్వేగానికి గురైంది. గతంలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేసిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని గుర్తుచేసుకుంది. ఆ అనుభవం తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ప్రస్తుతం తన పెంపుడు కుక్క పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మాత్రమే సినీ అప్డేట్స్ తెలుసుకుంటానని, వ్యక్తిగత గోప్యత మరియు మానసిక ప్రశాంతత తనకు ముఖ్యమని స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!