
.webp&w=3840&q=75)
శీతాకాలంలో మడమల పగుళ్లు చాలా సాధారణం. ఈ సమస్యను సకాలంలో చికిత్స చేయకపోతే చీము, నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు రావచ్చు. అయితే మడమలు ఎందుకు పగులుతాయి? వాటిని ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
శీతాకాలపు పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. దీని వల్ల మడమల పగుళ్లు ఏర్పడతాయి.
అధిక బరువు కారణంగా పాదాలపై, ముఖ్యంగా చీలమండలపై ఒత్తిడి పెరిగి పగుళ్లు వస్తాయి.
సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు, అలాగే డయాబెటిస్, థైరాయిడ్ పరిస్థితులు కూడా పగుళ్లకు కారణం అవుతాయి.
నాణ్యత లేని బూట్లు లేదా సరిపోని చెప్పులు ధరించడం వల్ల కూడా మడమలు పగులుతాయి.
శీతాకాలంలో చాలామంది తక్కువగా నీరు తాగడం వలన శరీరంలో తేమ తగ్గి చర్మం పొడిగా మారి పగుళ్లు ఏర్పడతాయి.
ప్రతిరోజూ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల మడమలు శుభ్రంగా, మృదువుగా ఉంటాయి.
స్నానం చేసిన వెంటనే లోషన్ లేదా కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె వంటి నూనెలను రాయండి.
పండిన అరటిపండును పేస్ట్గా చేసి మడమలకు 15 నిమిషాలు అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసం + కలబంద జెల్ కలిపి రాత్రిపూట పాదాలకు రాసి సాక్స్ వేసుకుని నిద్రపోతే పగుళ్లు తగ్గుతాయి.
మంచి నాణ్యత గల బూట్లు ధరించడం, పుష్కలంగా నీరు తాగడం, రోజుకు రెండు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ముఖ్యం.

_1771477764226.jpg&w=3840&q=75)






.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!