

మనం రోజూ వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే కరివేపాకును చాలామంది తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఇది కేవలం మసాలా దినుసు మాత్రమే కాకుండా ఒక శక్తివంతమైన సహజ ఆరోగ్య టానిక్ అని ప్రముఖ యోగా గురువు డాక్టర్ హంస యోగేంద్ర పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా 14 రోజుల పాటు కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరంలో గణనీయమైన ఆరోగ్య మార్పులు కనిపిస్తాయని ఆమె వివరిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్లు A, B, C, Eతో పాటు ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉండటం వల్ల ఇది డయాబెటిస్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజితం చేయడం ద్వారా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ను నిరోధించి కణాల క్షీణతను తగ్గించడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.
కరివేపాకులోని బీటా కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. డాక్టర్ హంసాజీ సూచనల మేరకు ఉదయం ఖాళీ కడుపుతో 4–5 తాజా కరివేపాకులను నమిలి గోరువెచ్చని నీరు తాగడం, మజ్జిగలో లేదా చట్నీ, పొడి రూపంలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!