.png&w=3840&q=75)

వేసవి కాలంలో కేవలం నీళ్లు తాగడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ నుంచి రక్షించుకోవడం సరిపోదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పేగు ఆరోగ్యాన్ని కూడా పదిలపరచే సాంప్రదాయ పానీయాలు మన దేశంలో విస్తారంగా లభిస్తాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన వేసవి డ్రింక్స్ ఉన్నాయి, ఇవి దాహం తీర్చడమే కాక, శరీరాన్ని చల్లగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరిచడంలో సహాయపడతాయి.
ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఆమ్ పన్నా పచ్చి మామిడికాయలు, పుదీనా, జీలకర్రతో తయారు చేస్తారు. ఇది ఎండ దెబ్బకు వ్యతిరేకంగా రక్షణగా ఉంటుంది. బాబ్రి బ్యోల్, కాశ్మీర్లో ఫేవరెట్ డ్రింక్, పాలు, నీళ్లు, సబ్జా గింజలు, కొబ్బరితో తయారు చేస్తారు; ఇందులోని సబ్జా గింజలు శరీరానికి తక్షణ చలవను ఇస్తాయి. ఫాల్సా బెర్రీస్ తీపి, పుల్లగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, వేసవిలో అలసట తగ్గిస్తుంది. జల్జీరా, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు మిశ్రమంతో తయారు చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మహారాష్ట్ర, గోవాలో ప్రసిద్ధి చెందిన కోకుమ్ షర్బత్ ముదురు గులాబీ రంగులో ఉంటుంది, ఇది కడుపులో మంట తగ్గిస్తుంది. బీహార్లో ప్రసిద్ధి చెందిన సత్తు షర్బత్ వేయించిన శనగపిండి కలిపి శక్తిని అందిస్తుంది, కడుపు నిండుగా ఉంచుతుంది. పెరుగులో జీలకర్ర, ఉప్పు, పుదీనా కలిపి చేసే మజ్జిగ సహజ ప్రోబయోటిక్, జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది. బెల్ షర్బట్, సోల్కఢి, నుంగు షర్బట్ వంటి ప్రాంతీయ పానీయాలు కూడా శరీరాన్ని చల్లగా ఉంచి జీర్ణాన్ని సులభతరం చేస్తాయి. కృత్రిమ రంగులు, చక్కెరలతో నిండిన కూల్ డ్రింక్స్ కంటే, ఈ సాంప్రదాయ పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!