

యాంటీబయాటిక్స్ మానవాళికి వరంలా అందిన ఔషధాలు. అయితే విచ్చలవిడిగా, వైద్యుల సూచన లేకుండా వాడటం, కోర్సును మధ్యలో ఆపేయడం వంటి తప్పుదారులు కారణంగా ఇవి క్రమంగా ప్రభావం కోల్పోతున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్కు నిరోధకతను సంతరించుకుని మరింత బలంగా మారుతున్నాయి.
హైదరాబాద్లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) భారత్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల్లో విస్తృత అధ్యయనం జరిపింది. ఈ పరిశోధనలో, మన దేశంలోనే యాంటీబయాటిక్ నిరోధకత అత్యధికంగా ఉందని వెల్లడైంది. ఎండోస్కోపీ చేయించుకునేందుకు ఆస్పత్రులకు వచ్చిన 83% మంది శరీరంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.
ప్రస్తుతం నవంబర్ 18–25 ‘యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ వీక్’ జరుగుతున్న వేళ ఈ నివేదిక బయటికి రావడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్యుల ప్రకారం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఇచ్చే మొదటి మూడు లైన్ల యాంటీబయాటిక్స్ కూడా ప్రభావం చూపకపోవడంతో నాలుగో లైన్ మందులు వాడాల్సి వస్తోంది. అయినా అవి కేవలం రెండు రకాలే. అవి కూడా పనిచేయకుండా పోతే, చికిత్స చేయడానికి మార్గం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురించబడ్డాయి.
ఎవరికైనా సులభంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం
వైద్యుల సూచించిన కోర్సును పూర్తిగా వినియోగించకపోవడం
ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయడం
వైద్యులు సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్ వాడకండి
వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ అడగవద్దు
వైద్యుల సూచన ప్రకారం కోర్సును పూర్తి చేయాలి; మధ్యలో ఆపేయకండి
శుభ్రత పాటించాలి
టీకాలు సమయానికి వేయించుకోవాలి
పెంపుడు జంతువులకు, పశువులకు డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వొద్దు
ఎండోస్కోపీ పేషెంట్లలో 80% మందికి పైగా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉండటం సమాజంలో వ్యాప్తి తీవ్రంగా పెరిగిందని సూచిస్తోంది. ఇలా కొనసాగితే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా చికిత్సకు లొంగవని ఆయన హెచ్చరించారు.
ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే యాంటీబయాటిక్స్ అమ్మేలా కఠిన చట్టాలు అవసరమని ఆయన సూచించారు.










కామెంట్స్ (1)
వైద్యుల సూచన తప్పనిసరి