

నేటి వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతోంది. పడుకున్నాక కూడా మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉండటం సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు మందులు అవసరం లేదని, కేవలం రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాల ధ్యానం చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చుని కళ్లను మూసుకుని, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం వల్ల మెదడు శాంతిస్తుంది. రోజంతా పేరుకుపోయిన ఒత్తిడి క్రమంగా తగ్గి, గాఢ నిద్రకు శరీరం సిద్ధమవుతుంది. ధ్యానం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు తగ్గి, హృదయ స్పందన సరిచేరుతుంది. దీంతో రక్తపోటు అదుపులోకి వచ్చి, మెదడు నిద్రకు అనుకూలమైన స్థితిలోకి మారుతుంది.
అలాగే, నిద్రలో మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మెదడులో భయానికి, ఆందోళనకు కారణమయ్యే భాగం శాంతించడం వల్ల అంతరాయం లేని నిద్ర లభిస్తుంది. ప్రతిరోజూ ఈ చిన్న అలవాటు పాటిస్తే, తక్కువ సమయంలోనే మంచి నిద్రతో పాటు మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!