
.webp&w=3840&q=75)
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ముఖ్యంగా నేత్రాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
పెరుగుతున్న డయాబెటిక్ రెటినోపతి కేసులు
25 నుంచి 74 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువ ప్రభావం
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్: మధుమేహం ఉన్న వ్యక్తుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ బాధితుల్లో సుమారు 17 శాతం భారతీయులేనని తెలిపారు. 25 నుంచి 74 ఏళ్ల మధ్య వయస్సు వారు ప్రధానంగా డయాబెటిక్ రెటినోపతితో చూపు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక మధుమేహం కారణంగా రెటినాలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని వైద్యులు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 181 మిలియన్ల మంది డయాబెటిక్ రెటినోపతితో బాధపడే అవకాశం ఉందని అంచనా వేశారు.
చూపులో నల్ల బొట్టలు కనిపించడం, మసక దృష్టి, చూపులో నల్లగా కనిపించే ప్రాంతాలు, ఖాళీలు కనిపించడం, చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
రక్తంలోని చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, ధూమపానాన్ని మానడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చర్యలతో ఈ సమస్యలను నివారించవచ్చని చెప్పారు.
డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
టైప్-1 మధుమేహం ఉన్న వారు నిర్ధారణ అయిన 5 సంవత్సరాల తర్వాత కంటి పరీక్ష చేయించుకోవాలి.
టైప్-2 మధుమేహం ఉన్న వారు నిర్ధారణ అయిన వెంటనే పూర్తి స్థాయి కంటి పరీక్ష చేయించుకోవాలి.
గర్భధారణకు ముందు మరియు గర్భధారణ మొదటి త్రైమాసికంలో మహిళలు కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.
— డాక్టర్ పద్మజా రాణి, విట్రియో-రెటినల్ స్పెషలిస్టు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!