

ఆయుర్వేద నిపుణుల ప్రకారం పునర్నవ లేదా గలిజేరు అనే ఈ ఔషధ మొక్క శరీరానికి పునరుజ్జీవం ఇచ్చే గుణాలు కలిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, లివర్ వాపు, అధిక బరువు, మధుమేహం, కఫ సమస్యలు వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, ఎరుపు రకాలుగా లభించినా తెల్ల గలిజేరు ఉత్తమంగా భావిస్తారు.
ఈ ఆకులను వారానికి రెండు మూడు సార్లు ఆహారంలో తీసుకుంటే శరీరంలో నీరు నిల్వ తగ్గి, రక్తం శుద్ధి అవుతూ, కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీర బలాన్ని పెంచుతాయి. ఆకులతో చేసిన కషాయం, నూనె మర్దన వంటి విధానాలు వాపు, నొప్పులు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!