

టాలీవుడ్లో ప్రముఖ జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారాయి. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సీక్రెట్గా కొనసాగిన తమ ప్రేమకథకు ఈ జంట ఇటీవల పెళ్లితో ముగింపు పలికింది. ఫిబ్రవరి 26 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. ఈ వేడుక రెండు సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు నిర్వహించబడింది.
ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ నిన్న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్గా జరిగింది. విజయ్ దేవరకొండ పంచకట్టుతో రాయల్ లుక్లో కనిపించగా, రష్మిక ఎరుపు రంగు చీరలో ఆకట్టుకుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన విజయ్, “తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది... ఆమెను మీరు ప్రేమగా చూసుకోవాలి” అంటూ రష్మికను పరిచయం చేశాడు. రష్మిక కూడా అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ ఉండాలని కోరుకుంది.
ఇక వీరి ప్రేమకథలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల కథనాల ప్రకారం, ఒక కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ రష్మికే ముందుగా ప్రేమను వ్యక్తం చేసిందని చెప్పినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి పరిచయం గీతా గోవిందం సినిమా సమయంలో మొదలైందని, తరువాత వచ్చిన డియర్ క్రామెడ్ సినిమా సమయంలో మరింత దగ్గరయ్యారని అభిమానులు చెబుతున్నారు. ఎన్నో రూమర్స్ మధ్య తమ సంబంధాన్ని బయట పెట్టకుండా ఎనిమిదేళ్లు కొనసాగించిన ఈ జంట చివరకు పెళ్లితో తమ ప్రేమకథను అధికారికంగా ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!