
బిజినెస్

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్లో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది రషా తడానీ రెమ్యునరేషన్. తొలి తెలుగు సినిమాకే ఆమెకు సుమారు కోటి రూపాయల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. హీరో మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ట్రోలింగ్ చేస్తుండగా, మరికొందరు ఇది న్యాయమేనని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!