

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. సుమారు ₹1,200 కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయి కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ‘వారణాసి’ ఓటీటీ హక్కులపై అడిగిన ప్రశ్నకు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఆసక్తికరంగా స్పందించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఆమె వ్యాఖ్యలు నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదిరే అవకాశాలపై చర్చలకు దారితీశాయి. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!