
రాజకీయాలు

టామ్ క్రూజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం డిగ్గర్ విడుదలకు సిద్ధమవుతుండగా, మరో ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ హీరో టామ్ క్రూజ్, ఇప్పుడు పారామౌంట్ పిక్చర్స్ నిర్మించనున్న డూపెల్గాంగర్ అనే స్పై థ్రిల్లర్లో నటించే అవకాశమున్నట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని తెలుగు మూలాలున్న దర్శకుడు అనీష్ చాగంటి తెరకెక్కించే అవకాశముందని సమాచారం. 2018లో విడుదలైన సెర్చింగ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనీష్, డాన్ ఫ్రేతో కలిసి రాసిన కథను పారామౌంట్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టామ్ క్రూజ్తో పలుమార్లు చర్చలు జరిగినట్లు, ఈ ప్రాజెక్ట్కు ఆయన నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!