

"సరిపోదా శనివారం" సినిమాతో విజయాన్ని సాధించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తన తదుపరి సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై దర్శకుడు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సమాచారం ప్రకారం, ఈ కొత్త చిత్రంలో హీరో కార్తీ ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.
తన తాజా చిత్రం “అన్నగారు వస్తారు” ప్రమోషన్ కార్యక్రమంలో కార్తీ ఈ విషయాన్ని సూచిస్తూ, “వివేక్, మనం ఇటీవల కలిసాం. మన తదుపరి సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. గతంలో వివేక్ ఆత్రేయ సూపర్స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయనున్నట్లు, ఆ తర్వాత సూర్యతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కార్తీ కూడా ఈ దర్శకుడితో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
వివేక్ ఆత్రేయ హాస్యాన్ని చక్కగా చూపించగల దర్శకుడు కావడంతో, ఆయన స్టైల్ కార్తీ నటనకు బాగా సరిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివేక్ ఒక కథను కార్తీకి వివరించాడని, ఇంకా కొన్ని సమావేశాల తర్వాత ప్రాజెక్ట్ను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, కార్తీ నటించిన “అన్నగారు వస్తారు” చిత్రం డిసెంబర్ 12, 2025 న థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!