

టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు నటి ఈషా రెబ్బా సాన్నిహిత్యం.
‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల వీరిద్దరూ హీరో విశ్వక్సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో కలిసి కనిపించడం ఈ రూమర్స్కు మరింత బలం చేకూర్చింది. విశ్వక్ షేర్ చేసిన ఫోటోలలో పక్కపక్కనే కనిపించిన వీరి ఫ్రేమ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, తరుణ్ భాస్కర్ ఇప్పటికే లతా నాయుడుతో వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ విడిపోయారని సమాచారం. ఇప్పుడు ఈషాతో ఆయన సాన్నిహిత్యం నేపథ్యంలో “ఇద్దరి మధ్య నిజంగా ఏదైనా ఉందా?” అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.
ఇది కొత్త సినిమా ప్రమోషనా లేక నిజమైన రిలేషన్నా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఫిలింనగర్ మాత్రం ఈ జంట గురించి తెగ చర్చించుకుంటోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!