

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రగ్డ్ లుక్లో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందన పొందాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ మాస్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా మూడు నుంచి నాలుగు మంది హీరోయిన్స్ కలిసి కనిపిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను సినిమాకు ఒక పెద్ద విజువల్ ట్రీట్గా రూపొందించే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా సమంత, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్, దిశా పటాని అలాగే శ్రీలీల పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే చివరకు ఎవరు ఈ పాటలో కనిపిస్తారన్నది వారి డేట్స్పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమాను వచ్చే నెల 30 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే నెల 10 నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గతంలో 'ఆర్ఆర్ఆర్'తో భారీ విజయాన్ని సాధించిన రామ్ చరణ్కు, తర్వాత వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ‘పెద్ది’ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో నిజంగా ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్స్ కనిపిస్తే అది అభిమానులకు పెద్ద ట్రీట్గా మారే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!