

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “రాకా” దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ ఫిక్చర్స్ (Sun Pictures)బ్యానర్పై కళానిథి మారన్ (Kalanithi Maran) నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల వ్యయంతో రూపొందుతున్నదని సమాచారం. ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవవచ్చని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో ఎక్కువ భాగం వ్యయం పారితోషికాలకే వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఈ చిత్రానికి దాదాపు 175 నుంచి 180 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని, అదనంగా లాభాల్లో వాటా కూడా పొందనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విజయం సాధిస్తే ఆయన ఆదాయం 300 కోట్లకు పైగా చేరే అవకాశముందని అంటున్నారు. దర్శకుడు అట్లీ కూడా ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. హీరోయిన్గా దీపిక పదుకొణె నటిస్తున్నట్లు, ఆమెకు 20 నుంచి 25 కోట్ల మధ్య పారితోషికం ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు ఉన్నాయి.
“రాకా” సాధారణ యాక్షన్ చిత్రం కాదని, పురాణం, విజ్ఞానకల్పన, ఫాంటసీ అంశాలతో రూపొందుతున్నదని చెబుతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం ఉంది. ప్రత్యేకమైన రూపాల కోసం ఎక్కువ సమయం మేకప్కు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతుండగా, దృశ్య ప్రభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచే ప్రాజెక్ట్గా మారనుందని అందరూ భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!