

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొమ్మిదేళ్ల తర్వాత చైనాను సందర్శించి, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కీలక భేటీ నిర్వహించారు. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాన్ని అత్యంత ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశంగా ట్రంప్ పేర్కొన్నారు. షీ జిన్పింగ్ గొప్ప నాయకుడని కొనియాడుతూ, ఆయనను స్నేహితుడిగా పిలుచుకోవడం తనకు గౌరవంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు అందరికీ నచ్చకపోయినా, అవి నిజమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పర్యటనతో అమెరికా-చైనా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
షీ జిన్పింగ్ మాట్లాడుతూ ప్రపంచమంతా ఈ భేటీని ఆసక్తిగా గమనిస్తోందన్నారు. అమెరికా, చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వామ్య దేశాలుగా ఉండాలని సూచించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించవచ్చని, ఇరుదేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రయోజనాలు విభేదాల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్య అంశాలపై ట్రంప్తో చర్చలకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇరుదేశాల బలమైన సంబంధాలు ప్రపంచానికి మేలు చేస్తాయని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!