

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!