
క్రీడలు

రాష్ట్రంలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాలకు చెందిన సుమారు 100 మంది ప్రముఖుల సెక్యూరిటీని తగ్గించింది. మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంలో తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా భద్రతా సమీక్ష నిర్వహించి నిబంధనలను సవరించారు. ప్రస్తుతం దాదాపు 600 మంది ప్రముఖులకు భద్రత కల్పిస్తుండగా, జులై 1 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. భద్రతా వనరులను మరింత సమర్థంగా వినియోగించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!