

తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. 18 రవాణా సంఘాలతో కూడిన జేఏసీ రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆటో, క్యాబ్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అదే విధంగా తెలంగాణలో గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని అమలు చేయాలని, ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!