
క్రీడలు

ప్రశ్నపత్రాల లీక్లు, పరీక్షల రద్దు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు కేవలం వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాకుండా లక్షల మంది యువత కలలకు తీవ్ర దెబ్బ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది.
కోటాలో జరగనున్న తొలి విద్యార్థి సదస్సుకు ముందు ‘ఎక్స్’లో స్పందించిన రాహుల్, యువతకు కలలు కనడం కూడా శిక్షగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సమస్యలు వినకపోతే మరింత గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నెల 17న కోటాలో జరిగే సదస్సును పెద్ద ఉద్యమంగా మార్చాలని రాహుల్ గాంధీ కోరారు. ఇది యువత భవిష్యత్తు కోసం జరిగే పోరాటమని, తాను వారికి పూర్తి మద్దతుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!