

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమా పొంగల్ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమా విడుదల అనంతరం తనకు చెల్లించాల్సిన రూ.8.39 కోట్ల పారితోషికం చెల్లించలేదంటూ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్పై సుధా కొంగర కోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదాన్ని తొలుత మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. అయితే నియమితులైన మధ్యవర్తులు కేసు నుంచి తప్పుకోవడంతో ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. తాజాగా కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సుధా కొంగరకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు బకాయి ఉన్న రూ.8.39 కోట్లను నాలుగు వారాల్లోగా చెల్లించాలని డాన్ పిక్చర్స్ను ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, నిర్మాణ సంస్థ భవిష్యత్తులో నిర్మించే సినిమాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగర బకాయిలను తీర్చాలని కోర్టు స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!