
సినిమాలు

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. మాచర్ల నుంచి కర్నూలు వైపు హైవేపై వెళ్తున్న సమయంలో లారీ టైర్లు రాపిడికి గురికావడంతో మంటలు వచ్చినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్తో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే సమీపంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారి సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను సవ్యంగా మార్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!