
సినిమాలు

శివ ప్రతాప్ శుక్లా సోమవారం హైదరాబాద్లోని లోక్ భవన్లో 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలతో అనుసంధానమై, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ సుపరిపాలనకు కృషి చేయాలని ఆయన సూచించారు. నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయడం ప్రతి అధికారికి అత్యంత ముఖ్యమని గవర్నర్ పేర్కొన్నారు.
శిక్షణలో ఉన్న ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డా. కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!