
క్రీడలు

రాయదుర్గం భూముల వివాదం నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని బ్యాంకు ఉన్నతాధికారులు సీఎస్ రామకృష్ణారావును కోరినట్లు సమాచారం. ప్రభుత్వ నిధులను ఎస్బీఐ నుంచి ఉపసంహరిస్తారనే ప్రచారం మధ్య బ్యాంకు ప్రతినిధులు సచివాలయంలో సీఎస్ను కలిసి వివరణ ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం భూముల విషయంలో తన నిర్ణయం మారదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ఎస్బీఐలో సుమారు రూ.6,000 కోట్ల నిధులు వివిధ శాఖలలో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రైతుల కేసీసీ ఖాతాలు ఉన్నాయి. మొత్తం 32.04 లక్షల కేసీసీ ఖాతాల్లో 18.49 లక్షలు ఎస్బీఐలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ బ్యాంకింగ్ నిర్ణయాలపై ప్రభుత్వం దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!