
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జెన్ జీ యువతకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. 21 ఏళ్లకే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, 25 ఏళ్లకే శాసనమండలి, రాజ్యసభకు పోటీ చేసే అర్హత కల్పించాలని కోరుతూ తెలంగాణ శాసనసభలో ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ జనాభాలో జెన్ జీ వాటా దాదాపు 30 శాతం ఉన్నప్పటికీ, లోక్సభలో వారి ప్రాతినిధ్యం 1 శాతానికి కూడా తక్కువగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువత సమస్యలు సమర్థంగా పరిష్కరించాలంటే వారికి చట్టసభల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ఆగస్టు తొలి వారంలో ప్రత్యేకంగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి తీర్మానం ఆమోదించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!