
క్రీడలు

రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, తుంగభద్ర జలాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
కేసీకెనాల్కు అనధికార నీటి మళ్లింపులు, ప్రధాన కాలువ పనుల్లో సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు. తుంగభద్ర నుంచి వచ్చే నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని, ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశలో 2.12 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాల నిర్మాణానికి 3,165 ఎకరాల భూసేకరణ చేపట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!