

విజయవాడ నగర ట్రాఫిక్ నిర్వహణ విధానంపై పలు వర్గాల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రమాదాలను నివారించడం కోసం సుమారు ₹2,700 కోట్ల వ్యయంతో నిర్మించిన బైపాస్ ఉన్నప్పటికీ, భారీ వాహనాలకు నిర్దిష్ట సమయాల్లో నగరంలోకి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వాహనదారులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ బోర్డుల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం అమల్లో ఉంది. మిగిలిన సమయంలో నగరంలోకి ప్రవేశానికి అనుమతి ఉంది. ఇప్పటికే రామవరప్పాడు, బెంజ్ సర్కిల్, కృష్ణలంక, బస్టాండ్ ప్రాంతాలు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, భారీ వాహనాల ప్రవేశం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!