12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

Writer: Harika S 05:42 AM, 12 ఆగస్టు, 2026
నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

పీఓబీ, 22ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని చెప్పారు.

భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్‌, లేఅవుట్‌ అనుమతులు తదితర పత్రాలను ఆగస్టు 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనివల్ల నకిలీ పత్రాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌ రిజిస్ట్రార్లకు స్పష్టత లభిస్తుందని తెలిపారు. మరింత పారదర్శకత కోసం సబ్‌ రిజిస్ట్రార్లకు పహానీ రికార్డుల యాక్సెస్‌ కల్పించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్‌ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దరఖాస్తుల్లో నిజమైన వాటిని గుర్తించి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ రెవెన్యూ శాఖనిషేధిత భూములు22ఏ జాబితాభూముల రెగ్యులరైజేషన్తెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
సినిమాలు

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?
సినిమాలు

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?
సినిమాలు

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ
జనరల్

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి
జనరల్

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్
జనరల్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
జనరల్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌
జనరల్

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!