

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేశారు. జిల్లాలోని 2.73 లక్షల రైతు కుటుంబాలకు రూ.99.58 కోట్లను జమ చేశారు. ‘మన ఊరు మాటా మంతి’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి ఈ నిధులను విడుదల చేసిన ఆయన, రైతు సంక్షేమం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 అందజేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా రూ.6,000 అందుతుండగా, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మరో రూ.14,000 జోడించి రైతులకు సంవత్సరానికి మొత్తం రూ.20,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!