

అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత, పాకిస్తాన్ నౌకాదళాలకు చెందిన నౌకల మధ్య ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ నేవీ నౌక భారత నౌకాదళానికి చెందిన నౌకను ఢీకొన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం సంభవించలేదని పేర్కొంది. అయితే పాకిస్తాన్ నౌకాదళ యూనిట్ల తీరును భారత్ ‘అసమంజసమైనది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైనది’గా పేర్కొంది.
ఈ ఘటనపై భారత్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన ఛార్జ్ డి అఫైర్స్ను తలబ్ చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 1991 ఏప్రిల్లో కుదిరిన భారత్-పాకిస్తాన్ సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పాకిస్తాన్ నౌక ప్రవర్తన విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో రెండు దేశాల నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు ప్రమాదాలను నివారించేందుకు కనీస దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాకిస్తాన్కు భారత్ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!