
టెక్నాలజీ

న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న జింఖానా క్లబ్ కు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం తక్షణ ఉపశమనం ఇవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహత, క్లబ్ను ఖాళీ చేయించే ముందు చట్ట ప్రకారం తప్పనిసరిగా నోటీసు ఇస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
అదే సమయంలో, బలవంతంగా ఖాళీ చేయించే చర్యలు ఉండవని కూడా స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నుంచి న్యూఢిల్లీ నడిబొడ్డులో సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఈ క్లబ్ను భద్రతా కారణాల దృష్ట్యా ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో క్లబ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!