

దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) వెన్నెముకలాంటివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్లో పాల్గొన్న ఆయన, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలేనని ఆయన పేర్కొన్నారు.
మహిళా ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!