
జనరల్

రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని సూచించింది.
అదే సమయంలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!