
రాజకీయాలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత నిరంతరం పెరుగుతోందని, దీంతో ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు వెంట తీసుకెళ్లాలని ప్రధాని సూచించారు. అలాగే ఈ వేళ ఇతరులకు సహాయం చేయాలని, దాహంతో ఉన్న వారికి నీళ్లు అందించాలని పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఉంచుతున్న వారిని ప్రధాని అభినందించారు. ఈ ఎండకాలంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!