
జనరల్

రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని ఎక్స్పోర్ట్ టెర్మినల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, 18 మంది గల్లంతయ్యారు. వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ఖతార్లోని కీలక ఇంధన కేంద్రంలో భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
రస్ లఫాన్ నుంచి ముడి చమురు ఇండియాకు సరఫరా అవుతుండటం వల్ల ఈ ప్రమాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన యూఎస్–ఇరాన్ ఘర్షణలో ఈ టెర్మినల్ నష్టపోయింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ తెరుచుకుని కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్న సమయంలో ఈ పేలుడు జరగడం ఖతార్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!