
జనరల్

జార్ఖండ్లో బొగ్గు మాఫియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. ధన్బాద్ జిల్లాలోని 31 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రముఖ బొగ్గు వ్యాపారి నివాసం నుంచి రూ.100 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదు గుట్టలుగా లభించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దర్యాప్తులో భాగంగా రూ.600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేసినట్లు సమాచారం. జార్ఖండ్లో ఇప్పటివరకు జరిగిన ఈడీ రికవరీల్లో ఇదే అతిపెద్ద స్వాధీనం అని అధికారులు పేర్కొన్నారు. బొగ్గు మాఫియా ఆర్థిక లావాదేవీలు, అక్రమ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!