
సినిమాలు

దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా విమానాశ్రయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ కెమెరాలను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్)తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనపై అధికారులు పని చేస్తున్నారు.
ఈ అనుసంధానం ద్వారా విమానాశ్రయాల్లో రియల్టైమ్ పర్యవేక్షణ సామర్థ్యం పెరగడంతో పాటు అనుమానిత వ్యక్తులను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుంది. అలాగే చట్ట అమలు సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సమయానుకూలంగా అందించడంతో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశ భద్రతను మెరుగుపరచడంలో ఈ చర్య కీలకంగా మారనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!