
జనరల్

మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ అనుమానాల నేపథ్యంలో వాయిదా వేసింది. భివండి ప్రాంతం నుంచి ప్రశ్నాపత్రం లీక్కు సంబంధించిన గోప్య సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు అత్యవసరంగా పరీక్షను వాయిదా వేసినట్లు మండలి వెల్లడించింది. ఈ ఘటన అభ్యర్థుల్లో ఆందోళనకు దారి తీసింది. లీక్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుండగా, కొత్త పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!