
జనరల్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలోని మాస్కో అణుశక్తి మ్యూజియంను సందర్శించారు. 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం సోవియట్ అణు ప్రాజెక్ట్ ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి అభివృద్ధి వరకు వివిధ ప్రదర్శనలను కలిగి ఉంది.
ఈ మ్యూజియంలో ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటంతో సందర్శకులకు ప్రత్యేక అనుభవం కలుగుతోంది. 2023లో ప్రారంభమైన ఈ కేంద్రాన్ని ఇప్పటివరకు 80 దేశాలకు చెందిన 35 లక్షల మందికి పైగా సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. మాస్కో ప్రభుత్వం మరియు రోసాటమ్ సంస్థ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!