

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. తనకు కేతన్ అగర్వాల్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని ముందుగానే చెప్పానని, అయితే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అతడు అంగీకరించలేదని సియా పేర్కొన్నట్లు సమాచారం. తన కుటుంబం ప్రభావశీలమైందని, పెళ్లి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని కేతన్ తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ వాదనలను ఇతర ఆధారాలతో సరిపోల్చి పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు, సియా గోయల్, చేతన్ చౌధరి ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను సియాతో కలిసి వెళ్లిపోవడమే లక్ష్యమని, హత్యకు ఆమెనే ప్రేరేపించిందని చేతన్ చెప్పగా, హత్య ఆలోచన పూర్తిగా చేతన్దేనని సియా ఆరోపించినట్లు సమాచారం. జూన్ 14న జరిగిన తొలి హత్యాయత్నం విఫలమైన తర్వాత చేతన్ తన ముందే భావోద్వేగానికి గురయ్యాడని ఆమె పేర్కొన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో అన్ని ఆధారాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!