
టెక్నాలజీ

హైదరాబాద్ సిటీ పోలీసులు దేశంలోనే తొలి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదు నమోదు యాప్ ‘ఏఐ కాప్రైటర్’ను ప్రారంభించారు. ఈ యాప్ను హైదరాబాద్ సీపీ VC సజ్జనార్ బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో ఆవిష్కరించారు. బాధితులు తమ మాతృభాషలో మాట్లాడితే, యాప్ వెంటనే దానిని టెక్స్ట్గా మార్చి అనువదించే సదుపాయం కల్పిస్తుంది.
తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా భారతీయ భాషలను ఈ యాప్ గుర్తించగలదు. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్గా PDF రూపంలో భద్రపరచడం, బాధితుడు–నిందితుడు–సాక్షుల మాటలను వేర్వేరుగా గుర్తించడం వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు భాషా సమస్య లేకుండా సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!