

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఆసుపత్రిపై వస్తున్న కిడ్నీ రాకెట్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది రోగులకు సేవలు అందిస్తున్న నిమ్స్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఒక పేషెంట్ ఫిర్యాదు మేరకు, కిడ్నీ ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని గుర్తించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. ఈ కేసును పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలు, తప్పుడు ప్రచారం పట్ల మీడియా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీరప్ప కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!